వర్సిటీలు, కళాశాలల్లో ఫ్రీ వైఫై: సీఎం

21 Oct, 2016 01:22 IST|Sakshi
వర్సిటీలు, కళాశాలల్లో ఫ్రీ వైఫై: సీఎం

సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలతోపాటు అన్ని కళాశాలల్లో నెలరోజుల్లోనే ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకనుంచి క్లాసుకెళ్లి మాత్రమే కాకుండా, ఎప్పుడు చదువుకోవాలనిపించినా చదువుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఉన్న 41,174 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో సైతం డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,212 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను గురువారం విశాఖ ఏయూ కాన్వొకేషన్ హాలు నుంచి సీఎం  ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు