అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై

22 May, 2015 23:10 IST|Sakshi
అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై

విజయవాడ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల బస్ స్టాండ్లలో ఉచిత వై-ఫై సేవలను విస్తరిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాబశివరావు చెప్పారు. ఈ మేరకు అవసరమైన పనులు చేపట్టామని, తర్వరలేనే బస్టాండ్లలో వై-ఫై సేవల్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

శుక్రవారం విజయగరం ఆర్టీసీ కాంప్లెక్సును ఆయన తనిఖీ చేశారు. విజయనగరం, శ్రీకాకులం డిపోలు రూ.60 కోట్ల నష్టంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పెంపు సమయంలోనే బస్సు చార్జీల పెంపునకూ సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు