తాడేపల్లిలో కలకలం.. ఫ్రిడ్జ్‌లో గ్యాస్‌ పేలి మంటలు

20 Oct, 2019 13:25 IST|Sakshi

సాక్షి, గుంటూరు : తాడేపల్లిలోని ప్రకాశ్‌ నగర్‌లో పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్‌ నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఫ్రిడ్జ్‌లోని గ్యాస్‌ పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో పైడమ్మ అనే మహిళకు గాయాలు అయ్యాయి.  ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు