20 నుంచి సమైక్య శంఖారావం

18 Jan, 2014 05:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మెడ నొప్పితో బాధపడుతున్నందున యాత్ర ఒక రోజు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

వైద్యుల సూచన మేరకు మరో రెండు రోజులు వాయిదా వేసినట్లు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సోమవారం నుంచి నగరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సమైక్య శంఖారావం యాత్ర సాగనుంది.
 

మరిన్ని వార్తలు