పెట్రో దడ

1 Oct, 2015 02:06 IST|Sakshi
పెట్రో దడ

గురువారం నుంచి ‘పెట్రో’ నిరవధిక సమ్మె నేపథ్యంలో బుధవారం వాహనదారులకు దడ పట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా బంక్‌ల వద్ద వినియోగదారులు కిక్కిరిసిపోయారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండి వాహనాల ట్యాంకులను ఫుల్ చేసుకున్నారు. కొన్నిచోట్ల వాహనదారుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె వంటి నగరాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద ద్విచక్ర వాహనదారులు వందల సంఖ్యలో గుమిగూడారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
 

మరిన్ని వార్తలు