పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం

15 Jun, 2016 09:52 IST|Sakshi

చిత్తూర్తు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామంలో 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 17 సెల్ ఫోన్లుతోపాటు 5 కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు