పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం

22 May, 2016 14:22 IST|Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ బెల్లంకి వీధిలో పేకాటస్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు