చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు

21 Jan, 2017 09:47 IST|Sakshi
చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు

వైఎస్‌ఆర్‌ జిల్లా : వైఎస్‌ఆర్‌ జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట జలాశయానికి అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చౌటుపల్లిలో 911 మంది బాధితులకు గాను ప్రభుత్వం కేవలం 140 మందికి మాత్రమే పరిహారం అందించింది. పరిహారం అందని బాధితులు గ్రామంలోనే ఉండిపోయారు. ఆందోళనలు చేశామన్న కారణంతోనే ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐదు అడుగుల మేర నీరు రావడంతోనే మట్టికట్ట తెగిందని గ్రామస్తులు చెప్పారు.

మరిన్ని వార్తలు