8 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

5 Oct, 2015 10:41 IST|Sakshi

పత్తిపాడు: అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల గంజాయిని పత్తిపాడు జాతీయరహదారివద్ద సోమవారం ఉదయం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు స్థానిక పోలీసులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. రెండు బోలెరో వాహనాల్లో ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రెండు బోలెరో వాహనాలతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు