మురికి కాలువలో గంజాయి బ్యాగులు

29 Aug, 2017 11:38 IST|Sakshi
విజయనగరం: విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మురికి కాలువలో పెద్ద ఎత్తున గంజాయి బ్యాగులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జిల్లాలోని సాలూరులో మంగళవారం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కోటదుర్గమ్మ గుడి సమీపంలోని కాలువలో సుమారు 25 బ్యాగుల గంజాయిని పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 
మరిన్ని వార్తలు