భారీగా గంజాయి పట్టివేత : ముగ్గురు అరెస్ట్

13 Jul, 2016 15:39 IST|Sakshi

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కాలేజీ వద్ద 156 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే కారు, రెండు సెల్ ఫోన్లతోపాటు బైక్ సీజ్ చేశారు.రూ. 8, 400 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు