కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కిష్టవరం టోల్గేట్ వద్ద బుధవారం ఉదయం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఆనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు.