ఉదయభానుకు పదవి

13 Nov, 2018 07:14 IST|Sakshi

విజయనగరం, పార్వతీపురం: వైఎస్సార్‌ సీపీ అరకు, శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్‌ జిల్లాల ఎస్సీ కో–ఆర్డినేషన్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా గర్భాపు ఉదయభాను నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కేంద్రకార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన పదిమంది సభ్యులు, ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేయగా ఉత్తరాంధ్ర పరిధిలోని అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లాల పరిధి నుంచి ఉదయభానుకు ఎస్సీ కోఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఉదయభాను గతంలో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా మూ డు పార్లమెంట్‌ జిల్లా ల ఎస్సీ కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉదయభాను పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ పెద్దలకు కృతజ్ఙతలు తెలిపారు.

మరిన్ని వార్తలు