గ్యాస్ లారీ ప్రమాదంలో ఒకరి మృతి

10 Apr, 2016 13:03 IST|Sakshi

మదనపల్లి శివారులో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద గ్యాస్ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరు మండలం ఈడిగపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(46) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ఈడిగపల్లి నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు