ఆఖరి పోరాటానికి సిద్ధంకండి

17 Nov, 2017 02:26 IST|Sakshi

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపు

కొత్తపేట: ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీలోపు హామీ నెరవేర్చకపోతే ఆ రోజు ప్రకటించే ఆఖరి పోరాటానికి ప్రతి కాపు కుటుంబం రోడ్డెక్కేందుకు సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇదే ప్రభుత్వానికి హెచ్చరిక అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో ఆ గ్రామ కాపు అభ్యుదయ సంఘం గురువారం నిర్వహించిన కార్తీక వన సమారాధన సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముద్రగడ పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని వార్తలు