ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు

16 Oct, 2013 14:58 IST|Sakshi
ఇది సమైక్యవాదుల విజయం: అంబటి రాంబాబు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, రాష్ట్ర హైకోర్టు మాత్రం ఆ సభకు అనుమతి ఇచ్చిందని, ఇలా ఇవ్వడం సమైక్యవాదులు సాధించిన విజయమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమైక్యవాదులు కూడా ఈ సభకు హాజరవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా పోరాడుతోందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు