ఘనంగా ఘంటసాల 41వ సంస్మరణ సభ

11 Feb, 2015 20:52 IST|Sakshi
ఘనంగా ఘంటసాల 41వ సంస్మరణ సభ

విజయనగరం టౌన్: పట్టణంలోని లయన్స్ కమ్యూనిటీ హాలులో ఘంటసాల 41వ సంస్మరణ సభ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ముగింపు సమయంలో ఆచంట రామేశ్వర శతకం, మదన గోపాల శతకం పుస్తకాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం భీష్మారావు, అధ్యక్షుడు నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు