యువతిపై సామూహిక అత్యాచారం

17 Jan, 2015 16:24 IST|Sakshi

తెనాలిలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలిలో నివసిస్తున్న ఒక యువతిని ముగ్గురు యువకులు వేమూరు పొలాల్లోకి తీసుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచార విషయాన్ని బయటకు వెల్లడిస్తే తల్లిని, తమ్మున్ని చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అనంతరం బాధితురాలు  పోలీసులను ఆశ్రయించి యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు