తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం!

29 Jan, 2017 18:00 IST|Sakshi

తిరుమల: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో కలకలం రేపింది. యాత్రికుల ఉచిత సముదాయ భవనంలో నవ్య అనే చిన్నారిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని తెప్పించుకుని అధికారులు పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ అయిన చిన్నారి భవ్య ఫ్యామిలీది అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తుంచర్ల గ్రామం. నవ్య పొరపాటున తప్పిపోయిందా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు