లైంగిక వేధింపుల ఆరోపణలపై హెచ్ ఎం సస్పెన్షన్

27 Jan, 2014 17:32 IST|Sakshi

కర్నూలు:  లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదోని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. విద్యార్థినులను తరచు లైంగికంగా వేధిస్తున్నాడంటూ 'సాక్షి' కథనంపై  డీఈవో స్పందించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడ్నివిధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై లైంగికంగా వేధిస్తున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

 

హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఆరోపించారు. హెచ్ ఎం ప్రవర్తన బాగోలేదంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను సాక్షి టీవీ ప్రసారం చేయడంతో మహిళా సంఘాలు కూడా గళం కలిపాయి. దీంతో ఆ కీచక టీచర్ పై వేటుపడక తప్పలేదు.

>
మరిన్ని వార్తలు