సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న డీఎస్సీకి ప్రస్తుతం టీటీసీ రెండో ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ఓబులపతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై బృందంగా వెళ్లి విద్యాశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా చేసిన బదిలీలు రద్దు చేసి ఈ అక్రమ బదిలీల విధానానికి స్వస్తి పలకాలన్నారు. అదే విధంగా 2013లో బదిలీలు చేసిన 1,996 మంది టీచర్లను తక్షణం విముక్తుల్ని చేయాలని కోరారు.