హామీలు అమలు చేయాలి

6 Aug, 2016 05:39 IST|Sakshi
గూడూరు : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు సీహెచ్‌ ప్రభాకర్‌ డిమాండ్‌చేశారు. గూడూరులోని సబ్‌కలెక్టర్‌ కార్యాయం సమీపంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కి బీజేపీ అదే తరహా ద్రోహం చేసిందన్నారు. పట్టణ కార్యదర్శి కాలేషా మాట్లాడుతూ ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రాభివద్ధి సాద్యమవుతుందన్నారు. జిల్లా సమితి సభ్యులు గౌస్‌బాష, ఏఐటీయూసీ డివిజన్, పట్టణ కార్యదర్శులు నారాయణ, రమణయ్య, సీతాభాస్కర్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు