బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు

4 Jun, 2015 03:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా సోమవారం విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఏడుగురు  తమ శరీరం లోపల బంగారం బిస్కెట్లు దాచి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. సెక్యూరిటీ విజిల్ మోగడంతో కస్టమ్స్ అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు