కలెక్టర్కు బంగారు నిక్షేపాల సమాచారం

28 Jun, 2014 19:24 IST|Sakshi

అనంతపురం: ఓ వృద్ధుడు తన ఇంట్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. పుట్లూరు మండలం ఎన్‌.తిమ్మాపురం గ్రామానికి చెందిన  వెంకట కొండయ్య  అనే వృద్ధుడు ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.

తన ఇంట్లో ఉన్న నిధులను వెలికితీసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు  ఎమ్మార్వో, పోలీసులు ఆ వృద్ధుడి ఇంటిని పరిశీలించారు.

మరిన్ని వార్తలు