తిరుమలేశుడికి బంగారు పాదాలు

29 May, 2014 09:33 IST|Sakshi

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడికి ఓ భక్తుడు బంగారు పాదాలు బహూకరించాడు. విజయవాడకు చెందిన సిరినాథ్ అనే భక్తుడు సుమారు రూ.30 లక్షల విలువ చేసే బంగారు పాదాలను గురువారం  స్వామివారికి సమర్పించాడు. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆ భక్తుడు ...ఈ మేరకు బంగారు పాదాలను ఈవోకు అందచేశారు.

 

>
మరిన్ని వార్తలు