తూర్పుగోదావరి : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో అమలాపురానికి చెందిన అభిమానులు బంగారు పూతతో కేక్ను తయారు చేశారు. పాదయాత్ర సాగుతున్న పసలపూడిలో కేక్ను కట్చేసి వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని జనంతో పంచుకున్నారు. దుబాయ్ నుంచి తెచ్చిన మెటీరియల్తో ఈ కేక్ తయారు చేశామని అభిమానులు చిట్టూరి గణేష్, మైడా గణేష్, సింహాద్రి శ్రీనివాస్, చిట్టూరి సాగర్, టేకి సత్యకుమార్తెలిపారు.