పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి

3 Sep, 2013 08:48 IST|Sakshi

విశాఖ : విశాఖ జిల్లాపెద గంట్యాడ  వద్ద ఓ గూడ్స్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గార్డ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు బొగ్గు లోడుతో  గంగవరం పోర్ట్ కు వెళుతుండగా  ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.  గాయపడినవారిని  పోర్ట్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు