పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

30 Jun, 2017 11:20 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అనంతరగిరి మండలం టైడా సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్‌-కొత్తవలస రైలు మార్గంలో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో శివలింగాపురం- టైడా స్టేషన్ల మధ్య గూడ్స్‌ పట్టాలు తప్పింది.

ఈ ఘటనతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కొండచరియలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు