కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య

11 Aug, 2014 08:37 IST|Sakshi

గొట్టిముక్కల :  పాత కక్షలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

 

దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి...అతన్ని నరికి చంపారు. కాగా టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు