శ్రీకాకుళం :‘ప్రస్తుత ప్రభుత్వం కేశవరెడ్డి పాఠశాల ఫిక్స్డ్ డిపాజిట్ బాధితులను విస్మరించింది’ అని శ్రీకాకుళంలోని కేశవరెడ్డి బాధితుల అసోసియేషన్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. 2014 నుంచి చెల్లింపులు ప్రారంభం కావాల్సి ఉందని, రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విద్యాస్కీమ్ కింద వసూలు చేశారని సభ్యులు తెలిపారు. ప్రభుత్వం కేశవరెడ్డి యాజమాన్యానికి అండగా ఉంటోందని వారు ఆరోపించారు.