శ్రీకాకుళం :‘సార్.. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు దీటుగా ఉండాలని ప్రవేశపెట్టిన మోడల్స్ స్కూల్స్లో పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది’ అని మోడల్ స్కూల్ ఉద్యోగులు జగన్కు చెప్పుకున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఈ స్కూళ్ల బాధ్యతలు అప్పగించిన తర్వాత అవస్థలు మొదలయ్యాయని తెలిపారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని, మోడల్ స్కూల్స్ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పెన్షన్ సౌకర్యం కలగజేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.