ఘనంగా నాగార్జున యూనివర్శిటీ స్నాతకోత్సవం

27 Feb, 2020 13:08 IST|Sakshi

హాజరైన గవర్నర్‌ బిస్వభూషన్‌ హరిచందన్‌

సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశిష్ట కార్యక్రమానికి గవర్నర్‌ బిస్వభూషణ్‌ హరిచందన్‌ చాన్స్‌లర్‌ హోదాలో హాజరయ్యారు.యూనివర్శిటీ డైక్‌మెన్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, వీసీ రాజశేఖర్‌, రిజిస్ట్రార్‌ రోశయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.180 మంది స్కాలర్స్‌కు వివిధ విభాగాల్లో డాక్టరేట్‌ డిగ్రీలు ప్రదానం చేశారు. పరిశోధన, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో అద్భుత ప్రతిభ చూపిన 249 విద్యార్థులకు గవర్నర్‌ హరిచందన్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు.
 

మరిన్ని వార్తలు