ఏపీలో ఓటు హక్కు పొందిన గవర్నర్‌ దంపతులు

10 Mar, 2020 14:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు పొందారు. విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో గవర్నర్‌, ఆయన సతీమణి ఓటు కోసం దరఖాస్తు చేయగా..  నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్‌ నాయమణి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ గవర్నర్‌ దంపతులకు ఓటరు కార్డును అందచేయనున్నారు.

>
మరిన్ని వార్తలు