అనంతబాబుకు బెయిల్ మంజూరు

16 Aug, 2014 01:16 IST|Sakshi

17న నియోజకవర్గానికి రాక

రంపచోడవరం(గంగవరం) : వైఎస్సార్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ (బాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత పెట్టిన అక్రమ కేసులో నిజనిజాలు లేవని విశాఖ జిల్లా సెషన్‌‌స కోర్టు నమ్మి, ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ అన్నారు.

శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుందన్నారు. అక్రమ కేసులతో అణగదొక్కలేరన్నారు. అనంతబాబు ఈ నెల 17న నియోజకవర్గానికి రానున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం అడ్డతీగల మండలం గొంటవానిపాలెం నుంచి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు