జీవోఎంకు నివేదిక ఇవ్వం: రేవూరి ప్రకాష్ రెడ్డి

10 Nov, 2013 12:03 IST|Sakshi

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

 

ఆదివారం వరంగల్లో ఆయన మాట్లాడుతూ.... జీవోఎంకు నివేదిక ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే అందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లదే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు