సత్తెనపల్లిలో గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం

27 Apr, 2015 06:51 IST|Sakshi

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం గిన్నిస్ రికార్డు సాధనా కార్యక్రమం జరగనుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1,500 మంది నీటితో చేతులను శుభ్రం చేసుకోనున్నారని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ సామూహిక చేతుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ కోసం ఆదివారం ఇక్కడ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఇందులో కోడెల పాల్గొని పరిశీలించారు.

మరిన్ని వార్తలు