దైవ సాక్షిగా.

13 Jun, 2019 12:29 IST|Sakshi
హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత

సాక్షి, గుంటూరు:  రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు  బుధవారం శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు..రాష్ట్ర శాసనసభకు జిల్లా నుంచి ఎన్నికైన 17 మంది శాసనసభ్యుల్లో బుధవారం 16 మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నరసరావుపేట నుంచి ఎన్నికైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల వలన హాజరుకాలేకపోయారు.

శాసనసభలో ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు వరుసగా విడదల రజని, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, కాసు మహేష్‌రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, అనగాని సత్యప్రసాద్‌.   

మరిన్ని వార్తలు