అనంతపురం కోర్టు వద్ద భారీగా బలగాలు

8 May, 2015 16:55 IST|Sakshi

అనంత:రాప్తాడులో వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన విధ్వంస కేసులో అరెస్ట్ చేసిన వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వీరితో పాటు మరో 32 మందిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో కోర్టు వద్ద భారీ బలగాలను మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావారణం నెలకొంది.  తాజాగా గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలపై మరో నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు.

 

 

మరిన్ని వార్తలు