ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది

18 Jan, 2014 12:07 IST|Sakshi

సమైక్య ముసుగులో విభజనకు పూర్తి స్థాయిలో తోడ్పడుతున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అది రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టి.బిల్లు చర్చ సందర్బంగా గుర్నాథ్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా శైలజానాథ్ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని అన్నారు. సమైక్య కన్వీనర్గా ఉన్న శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేశారని గుర్నాథ్రెడ్డి ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు