రూ.20లక్షల విలువైన గుట్కా పట్టివేత

9 Oct, 2015 18:06 IST|Sakshi

రాజమండ్రి (తూర్పు గోదావరి) : రాజమండ్రి పట్టణంలో రెండు షాపులపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించి రూ.20 లక్షల విలువజేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్‌హాల్ రోడ్డులో ఆర్.భద్రం ఏజెన్సీలో, నల్లమందు రోడ్డులో కోటయ్య సన్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుట్కాలతోపాటు రమేశ్, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు