గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. సోమవారం నుంచి విధులకు హాజరుకావడం లేదంటూ కార్మికులు సమ్మె నోటిస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారు మూడు వేల మంది కార్మికులు సమ్మె చేపట్టడంతో జీవీఎంసీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.