పగిలిన హంద్రీనీవా పైపులైన్లు

16 Oct, 2014 10:10 IST|Sakshi

కర్నూలు జిల్లా నాయకల్ వద్ద హంద్రీ నీవా పైప్ లైన్లు పగిలాయి. దాంతో నీళ్లు పెద్దమొత్తంలో వృథాగా పోతున్నాయి. పొలాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. ఈ కారణంగా రైతులు ఆందోళనలో్ మునిగిపోయారు. రైతులు చేసిన తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని అధికారులు అంటున్నారు.

పంట పొలాలకు నీళ్లు పెట్టుకోవడం కోసం కొంతమంది రైతులు ఈ పైపులైనుకు రంధ్రం చేసే ప్రయత్నం చేసి ఉంటారని, దానివల్లే అది కాస్తా పగిలిపోయి మొత్తం నీరు వృథా అవుతోందని భావిస్తున్నారు. తాగునీటిని పంటపొలాలకు ఉపయోగించకూడదని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.

మరిన్ని వార్తలు