యూనివర్సిటీక్యాంపస్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎస్వీయూ పరిశోధక విద్యార్థి వి.హరిప్రసాద్రెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పులివెందులలో జగన్మోహన్రెడ్డిని స్వగృహంలో కలిసి తనకు పదవి ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన అన్నారు. జగన్మోహన్రెడ్డిని కలసిన వారిలో ఎస్వీయూకు చెందిన విద్యార్థినాయకులు ఎల్.రాజశేఖరరెడ్డి, వి.హేమంత్కుమార్, మురళీధర్, కిషోర్కుమార్ ఉన్నారు.