'పంకజ పాత్రను బుచ్చయ్య పోషిస్తున్నారు'

6 Jul, 2015 13:36 IST|Sakshi
'పంకజ పాత్రను బుచ్చయ్య పోషిస్తున్నారు'

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశానవాటిక నిర్మించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 10లోపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని హెచ్చరించారు.

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవినీతికి పాల్పడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పాత్రను రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి పోషిస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సుందరీకరణ పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించి అవినీతిమయం చేస్తున్నారని హర్షకుమార్ అన్నారు.

మరిన్ని వార్తలు