శ్రీశైలానికి భారీగా వరద నీరు

16 Aug, 2018 19:55 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు(పాత చిత్రం)

కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు 3 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా.. అధికారులు 97 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.  జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 874.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం సామర్ధ్యం 215.80 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 163.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరిన్ని వార్తలు