ఎగువన కురుస్తున్న వర్షల వల్ల తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతొంది. దాంతో జలాశయంలో నీటి మట్టం మంగళవారం ఉదయానికి 57 అడుగులకు చేరుకొంది. దాంతో తుంగభద్ర దిగువ కాలువకు 650 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అలాగే సుంకేశుల జలశాయం నుంచి 350 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్కు వదిలారు. అయితే తుంగభద్ర జలాశయంలో ఇన్ఫ్లో 58,322 క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో1100 క్యూసెక్కులు అని అధికారులు తెలిపారు.