తిరుమలకు పోటెత్తిన భక్తులు

10 Jun, 2017 08:04 IST|Sakshi
తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి బయట ఓ కిలోమీటర్‌ మేర భక్తులు బారులుతీరారు.

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 81,347 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీకి రూ. 2.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు