భారీ వర్ష సూచన

23 Aug, 2014 02:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలో చాలా చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల, కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రాగల 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చు.
 

మరిన్ని వార్తలు