తిరుమల: తిరుమలలో ఆదివారం కురిసిన కుండపోత వర్షానికి ఘాట్ రోడ్డు కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విరిగి పడ్డ కొండచరియలను తొలగించడంలో జాప్యం కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.