ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి మరింత బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలోల ఏర్పడిన ఉపరిత ఆవర్తనాలు అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.